హీరోగా ఆది పినిశెట్టి .. నానితో టైటిల్ ప్రకటన

  • హీరోగా ఆది పినిశెట్టి 
  • కథానాయికలుగా తాప్సీ .. రితిక
  • త్వరలో పూర్తి వివరాలు  
నాని హీరోగా విజయాన్ని సాధించిన 'నిన్ను కోరి' సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్ వారు ఎమ్ వీవీ సినిమాస్ వారితో కలిసి ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించనుండగా .. తాప్సి .. రితికా సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను హీరో నానితో ఎనౌన్స్ చేయించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడి చేస్తారు. కొంతకాలంగా తెలుగులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వస్తోన్న ఆది పినిశెట్టి, ఈ సినిమాతో మళ్లీ హీరోగా ఆడియన్స్ ను పలకరించనుండటం విశేషం.      
Go Back to Shorts
aadi pinishetty
tapsee
rithika

More Telugu News